

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘లూసిఫర్’ రీమేక్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మోహన్రాజా దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం హాట్ టాపిక్గా మారింది.దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
చిరంజీవి నటించిన ‘స్టాలిన్’లో కథానాయికగా ప్రేక్షకులను అలరించారు నటి త్రిష. 2006లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరు కలిసి స్క్రీన్ పంచుకోలేదు.కొరటాల శివ దర్శకత్వం చేస్తున్న ‘ఆచార్య’లో మొదట త్రిషనే కథానాయికగా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు.
‘లూసిఫర్’ రీమేక్లో నయనతారని కథానాయికగా అనుకున్నట్లు ఫస్ట్ లో వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల వల్ల నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని.ఆమె స్థానంలో త్రిషని ఎంపిక చేసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రిష ‘లూసిఫర్’ రీమేక్లో నటించేందుకు రెడీ గా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తలపై ఏ అధికారిక ప్రకటన రాలేదు.