

పంజా వైష్ణవ్తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ని సాధించిన విషయం తెలిసిందే.
ఓ జంట ప్రయాణానికి అద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఒక హైలెట్గా నిలిచింది. ఈ సందర్భంగా రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్రసాద్కి ఒక మ్యూజికల్ గిఫ్ట్తో పాటుగా ఒక లేఖని పంపారు. ఆ లేఖలో..
Dear DSP,
ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ మ్యూజిక్ కి ఎంత ప్యాషన్ తో మ్యూజిక్ నిస్తావో , చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ప్యాషన్తో మ్యూజిక్ నిస్తావ్.నీలో ఉండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. God Bless Devi! యు are Truly a Rock Star!..ప్రేమతో చిరంజీవి.