

మన వంటింట్లో పసుపు లేకుండా ఏ ఇల్లు ఉండదు. భారత దేశ ప్రజలు పసుపు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. పసుపుని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేమేటరీలు శరీరాన్ని రోగాల బారి నుంచి కాపాడతాయి.ఇందులో కర్క్యుమిన్ పదార్థం ఉంటుంది. అది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పసుపుని ఆహారంలో భాగాన్ని చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు తెలుసుకుందాం.
*బరువు తగ్గడం..
బరువు తగ్గడానికి పసుపు బాగా పనిచేస్తుంది. మీ ఆహారంలో పసుపుని భాగంగా చేసుకుంటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీనికోసం కూరని ఎక్కువగా తినాలి. చాలా మంది అన్నం తిన్నంతగా కూరని తినరు. కూరని ఎక్కువగా తినడం వల్లే పసుపు శరీరంలోకి వెళ్తుంది.
*ఆర్థరైటిస్..
పసుపులో ఉండే కర్క్యుమిన్, కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు పసుపుని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
* ఒత్తిడిని తగ్గిస్తుంది..
ఈ కాలంలో ఒత్తిడి లేని మనుషులు ఎవరూ లేరు. పసుపు ఒత్తిడిని తగ్గించి ఆలోచించడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మన మూడ్ ని బాగు చేసి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
* బీపీ..
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. హైబీపీతో బాధపడేవాళ్ళు పసుపు చేసే మేలు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
*మతిమరుపు..
మతిమరుపుని పోగొట్టే అద్భుతమైన ఔషధం ఏదైనా ఉందంటే అది పసుపు అని చెప్పవచ్చు. వృద్ధాప్యంలో మతిమరుపు చాలా సాధారణమైన సమస్య. దీన్ని నుంచి బయటపడాలంటే పసుపుని ఆహారంలో తీసుకోవాలి. అందుకే పసుపుని ఆహారంలో భాగం చేసుకోవాలి.