

ప్రభాస్ చేయనున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ప్రభాస్ లైన్ గా సినిమాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఓం రౌత్ ఆదిపురుష్తో పాటుగా స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో సలార్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ రెండు సినిమాలు దగ్గర సమయాల్లో ప్రారంభం కానున్నాయి. ప్రభాస్ ఏ సినమా షూటింగ్లో పాల్గొంటాడో తెలీదు. ప్రభాస్ సరికొత్త సినిమా రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్ మొదలుపెట్టాల్సిఉంది. ఈ సినిమా రూ.3 వందల కోట్ల బడ్జెట్తో రూపొందనుంది. ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కాబోతుంది . ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్లు బిజీ కోబోతున్నారు .మరికొందరు సీనియర్ స్టార్ నటులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు.
ఈ షూటింగ్ ముంబై ఫిల్మ్ స్టూడియోలో చేయనున్నారని సమాచారం. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఓం రౌత్ అనుకుంటున్నారు . ఈ సినిమాలో షూటింగ్ కన్నా ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం చేయాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా చిత్రకరణ పూర్తి చేస్తే వీ ఎఫెక్ట్స్పై దృష్టి పెట్టొచ్చాని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా ఫినిష్ చేస్తారో చూడాలి.